కాప్రా: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీి) అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్ల మెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కుషాయిగూడలో బోనాల పండుగను పురస్కరించుకొని పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శిం చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్లను ఘనంగా సన్మానించారు. ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరూ సుఖసంతో షాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవిం చేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగా లని ఆకాంక్షించారు. కరోనా విపత్కర సమ యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్, బీసీ సంఘం రాష్ట్ర నాయ కులు తోటకూర జంగయ్య యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయ కులు అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కొత్త అంజిరెడ్డి, సీతారాం రెడ్డి, బొర్ర రాఘవరెడ్డి, మహమ్మద్ నజీర్, మెరు గు రామ్మోహన్, టిల్లు యాదవ్, పెద్ది శ్రీనివాస్ గుప్తా, టిల్లు యాదవ్, లింగస్వామి రాహుల్ రెడ్డి, లలిత్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి, పత్తి కుమార్, నీరుకొండ సతీష్బాబు పాల్గొన్నారు.