Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఘనంగా సయ్యద్ ఖలందర్ బాబా ఉత్సవాలు

••కులమాతలకు అతీతంగా ఉర్సు ఉత్సవాలు
విశాలాంధ్ర – ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్టాల గ్రామంలో చిల్లా హాజ్రత్ మౌలాలి సయ్యద్ షా ఖలందర్ బాబా దర్గా షరీఫ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ముతవల్లి జనాబ్ మహమ్మద్ అబ్దుల్ నయిమ్ షా ఖలందరి నివాసం నుంచి గంధం ఊరేగింపుతో దర్గాకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.ఈ గంధోత్సవంలో మత గురువు హజ్రత్ మహ్మద్ మౌలానా అబ్దుల్ కరీం షా ఖాద్రి బంధనావాజీ ఖలందరి పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక ఫతేహాలు, సలాం, దువా, ఖవాలీ,పూల దట్టిలతో చాదర్ ను సమర్పించారు. దర్గాకు వచ్చే భక్తులకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ ఉత్సవాలలో రంగారెడ్డి జిల్లా కో ఆప్షన్ సభ్యులు ముజిబుర్ రహ్మాన్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. దర్గా ముతవల్లి జనాబ్ రహ్మాన్ కు దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాలని మహమ్మద్ అబ్దుల్ నయిమ్ షా జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు ముజిబుర్అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఉర్సు ఉత్సవాలను నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు. దర్గా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ తన వంతు గా ఐదు వేల రూపాయలు ఉర్సు ఉత్సవాలకు అందజేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన‌ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ రహీం షా ఖాద్రీ ఫవాద్ ,ఉర్ రెహమాన్ తయేవార్ ,ఫరూకీ ఇసాక్ అలీ, అలీమ్, హాజీ బాబా, జాఫర్, నసీర్ ,దస్తగీరి ,అరిఫ్,మహీబూబ్ చాంద్ పాషా ,హాజీ ఖాజా ,మైనుద్దీన్ ,మహ్మద్ అబ్దుల్ల రాజేందర్ రెడ్డి,కల్వకోలు యాదగిరి,సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img