ఇస్లామాబాద్: గూఢచర్యానికి పాల్పడినట్టుగా ఆరోపిస్తూ భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షపై అప్పీల్కు పాక్ పార్లమెంటు అనుమతించింది. ఈ మేరకు పాక్ పార్లమెంటు ఉభయసభలూ దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించాయి. ‘ది ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్’ బిల్లు 2020 పేరుతో పాక్ న్యాయమంత్రి ఫరోమ్ నసీమ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేసినట్లు స్థానిక మీడియా వెల్లడిరచింది. జాదవ్ గూఢచర్యానికి పాల్పడుతూ బలూచిస్థాన్: వద్ద తమ సైనాన్యాకి పట్టుబడ్డారని పాక్ ఆరోపించింది. ఈ కేసులో ఆయనను దోషిగాప్రకటిస్తూ సైనిక కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. పాక్ ఆరోపణలను తోసిపుచ్చి భారత్ కుల్భూషణ్ను ఇరాన్ ఛబర్పోర్టులో అపహరించాని దుయ్యబట్టింది.
పాక్ సైనిక కోర్టు తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేయడంతో భారత్ వాదనలను సమర్థించిన అంతర్జాతీయ న్యాయస్థానం పాక్ చర్యలను తప్పుబట్టింది. అంతర్జాతీయ చట్టాలను పాక్ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃసమీక్షించాలని పాకిస్థాన్కు సూచించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్కు అవకాశం ఇవ్వాలంటూ భారత్ చేసిన వాదన సరైనదేనంటూ సమర్ధించింది. జాదవ్కు న్యాయసహాయం అందకుండా చేయడం వియన్నా ఒప్పందం ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. ఈ బిల్లు ప్రకారం.. వియన్నా ఒప్పందంలో హక్కుల ప్రకారం ఒక విదేశీ పౌరుడి అరెస్ట్కు సంబంధించి జారీచేసిన ఉత్తర్వులను సమీక్షించే, పునఃపరిశీలించే అధికారం హైకోర్టుకు ఉంది. ఈ బిల్లును తొలుత 21 మంది సభ్యులున్న పార్లమెంట్ స్టాండిరగ్ కమిటీ ఆమోదం తెలపడంతో పాక్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించారు.