Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తాలిబన్ల ప్రభుత్వానికి సన్నాహాలు!

కాబూల్‌ విమానాశ్రయం పున: ప్రారంభం

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు. శుక్రవారం (సెప్టెంబరు 3) తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం. మధ్యాహ్న ప్రార్థనల అనంతరం సంబంధిత ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అయితే తాలిబన్ల కేబినెట్‌ ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు. అఫ్గాన్‌లో ఏర్పాటుకానున్న తాలిబన్ల ప్రభుత్వానికి తాలిబన్‌ అగ్రనేత హీబాతుల్లా అఖుంద్‌జాదా నాయకత్వం వహించనున్నారు. దేశ ప్రధాని లేదా అధ్యక్షుడుగా అఖుంద్‌జాదా బాధ్యతలు చేపట్టే అవకాశంఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తాలిబన్లు..పాలనకు సంబంధించిన ఎటువంటి నియమాలు రూపొందించబోతున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. అధ్యక్ష భవనంలో వేడుకకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తాలిబన్‌ అధికారి అహ్మదుల్లా సోషల్‌ మీడియాలో వెల్లడిరచారు. మరోపక్క కాబూల్‌ విమానాశ్రయంలో కార్యకలాపాలు పున:ప్రారంభించడానికి తాలిబన్లతో కలిసి పనిచేస్తున్నట్లు ఖతార్‌ వెల్లడిరచింది. స్త్రీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే వారిని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి ఇళ్లకు పంపించడం జరుగుతూనే ఉంది. 2001లో తాలిబన్ల పాలన ముగిశాక 2002 నుంచి ఇప్పటివరకూ మిలియన్ల సంఖ్యలో మహిళలు చదువుబాట పట్టి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. రాజకీయాల్లో కూడా మహిళలు రాణించారు. ప్రస్తుత పరిస్థితి అంధకారంలోకి వెళ్లినట్లయింది. అంతర్జాతీయ సమాజం స్త్రీ హక్కులపై తీవ్ర అందోళన చేపట్టింది. గత ప్రభుత్వానికి సహకరించిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, సైనికుల కోసం తాలిబన్లు ఇంటింటికీ తిరిగి వాకబుచేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ప్రపంచ దేశాలు తమను గుర్తించాలని తాలిబన్లు తహతహలాడుతున్నారు. ఇరాన్‌, రష్యా,పాకిస్తాన్‌, చైనా దేశాలు మాత్రం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. పంజ్‌షేర్‌ను ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు దండెత్తుతున్నారు. మసాద్‌ నాయకత్వంలోని పంజ్‌షేర్‌ దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 350మంది మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img