Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

కొత్త రాజ్యాంగంపై ట్యునీషియాలో ప్రజా నిరసన

ట్యునీస్‌: కొత్త రాజ్యాంగం రచనపై అభిప్రాయ సేకరణకు ట్యునీషియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ ప్రకటన చేశాడు. అయితే ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. సోమవారం జరగనున్న ప్రజాభిప్రాయం సేకరణ చట్టవిరుద్ధమని దానికి వ్యతిరేకంగా వందలాది మంది శనివారం సెంట్రల్‌ ట్యూనిస్‌లో నిరసించారు. అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ రాజ్యాంగ ముసాయిదాను ప్రచురించారు. అందులో తనకు చాలా ఎక్కువ అధికారాలు ప్రకటించారు. ఒక నెల కిందటే పార్లమెంటు, న్యాయవ్యవస్థ పాత్రను తగ్గించాడు. అతని అధికారంపై చాలా చెక్‌లను తొలగించాడు, ‘‘తిరుగుబాటును మూసివేయండి!’’, ‘‘నిరంకుశ పాలనను ఆపండి!’’ అంటూ సెంట్రల్‌ టునిస్‌లోని ప్రధాన వీధి హబీబ్‌ బోర్గుయిబా అవెన్యూలో నిరసనకారులు నినదించారు. శనివారం నాటి నిరసనను సంకీర్ణం పార్టీలు నిర్వహించాయి.ఇందులో సిటిజన్స్‌ ఎగైనెస్ట్‌ ది కోప్‌, ఇస్లామిస్ట్‌ పార్టీ ఎన్నాహ్డా రద్దు చేయబడిన పార్లమెంటులో అతిపెద్దది. ఈ నిరసనకు పౌర సమాజ సంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొన్నారు. ప్రదర్శనకారులను చెదరగొట్టడానికి పోలీసులు కర్రలు, పెప్పర్‌ స్ప్రేని ఉపయోగించారు, వారిలో చాలా మందిని అరెస్టు చేశారు. చాలా మంది ట్యునీషియన్లు, రాజకీయ గందరగోళంపై ప్రశ్నించగా దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం అత్యంత అత్యవసర సమస్యగాపేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img