Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాక్‌ ప్రధాని నివాసం అద్దెకు..

ఇస్లామాబాద్‌ : ఆర్థిక కష్టాలలో ఉన్న పాకిస్తాన్‌ ఏకంగా ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వవలసిన పరిస్థితికి దిగజారింది. ఈ నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రకటించింది. ఆ తర్వాత ఆయన ఆ ఇంటిని ఖాళీ చేశారు. తాజాగా విశ్వవిద్యాలయంగా మార్చాలనే ప్రతిపాదనను విరమించుకుని సాంస్కృతిక, ఫ్యాషన్‌, విద్యాపరమైన కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వాలని పాక్‌ కేబినెట్‌ నిర్ణయించిందని పాక్‌ మీడియా వెల్లడిరచింది. ఇస్లామాబాద్‌లోని రెడ్‌జోన్‌లో ఉన్న ఈ ప్రాంగణాన్ని తదితర కార్యక్రమాల నిర్వహణ సమయంలో ప్రధాని అధికారిక నివాస మర్యాదలు, క్రమశిక్షణ నియమావళికి భంగం కలుగకుండా వ్యవహరించేలా చూడాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనికోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసంలోని ఆడిటోరియం, రెండు గెస్ట్‌ వింగ్స్‌, ఒక లాన్‌ను అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి ఇమ్రాన్‌ ఖాన్‌ తన బని గల నివాసంలో ఉంటున్నారు. అధికారిక కార్యకలాపాల కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వినియోగిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకూ పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ 19 బిలియన్‌ డాలర్లు పతనమైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకునేందుకు ఆయన అనేక పొదుపు చర్యలను అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img