విశాలాంధ్ర-మైలవరం : స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణ వద్ద భారత దేశ 74 వగణతంత్ర దినోత్సవం సందర్భంగా మైలవరం జూనియర్ సివిల్ జడ్జి షేక్ షరీన్ శిరీన్ గురువారం ఉదయం పతాకావిష్కరణ కార్యక్రమం జరిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎందరో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకులు కృషితో ఏర్పడిన భారత స్వతంత్రం అనంతరం భారతదేశ విధివిధానాలను రూపొందించడానికి వివిధ దేశాల రాజ్యాంగాలను అనుసరిస్తూ భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ సారధ్యంలో ఏర్పాటు చేసుకొని, చట్టాలు రాజ్యాంగ సవరణల ద్వారా ప్రతిఫలాలను మనం అనుభవిస్తున్నామని వారి కృషి వృధా కారాదని, ముఖ్యంగా న్యాయవాదులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్జ్ షేక్ శిరీన్ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైలవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మున్నంగి రవికుమార్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పోలీసులు తదితరులు పాల్గొన్నారు.