Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంతారకు ఆహ్వానం

చైర్మన్‌ డాక్టర్‌ ఎం. కాంతి కుమార్‌

విజయవాడ : ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ మెగా ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది. అంతార పేరిట ఈనెల 10, 11 తేదీల్లో విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో నిర్మాణ సామాగ్రి ఎక్స్‌పోను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సెమినార్లు, విద్యార్థులకు థీసిస్‌ అవార్డులు, అర్కిటెక్టులకు అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. అలాగే, విద్యార్థుల చేసిన పనిని ప్రదర్శిస్తారు. ప్రముఖ ఆర్కిటెక్టుల సందేశాలు, పుస్తకావిష్కరణలతో పాటు నిర్మాణ సామాగ్రి, ఉత్పత్తుల విస్తృత శ్రేణి ప్రదర్శన ఉంటుంది. అంతారకు ఉచిత ప్రవేశం ఉంటుంది. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, బిల్లడర్లు, ఇంటీరియర్‌ డిజైనర్లుతో పాటు ప్రజలంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.కాంతి కుమార్‌, వైస్‌ చైర్మన్‌ విజయ్‌ భాస్కర్‌, గౌరవ కోశాధికారి రాధాకృష్ణ, సంయుక్త గౌరవ కార్యదర్శులు వేణుగోపాల్‌, విజయ ఆనంద కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సీఎస్‌ ప్రకాశ్‌, రాజశేఖర్‌, రేవతిదేవి, సాహిత్య, సందీప్‌ కుమార్‌, శ్రీనివాస్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ ఆదిత్య కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img