Friday, April 26, 2024
Friday, April 26, 2024

గర్భవతులకు వైద్య పరీక్షలు

విశాలాంధ్ర..బొమ్మనహల్ .. మండలంలోని లింగాధహల్ గ్రామంలో సోమవారం ఫ్యామిలీ ఫైజీసియన్ కార్యక్రమంలో డాక్టర్ గీత భార్గవి ఆధ్వర్యంలో హై రిస్కు గర్భవతులు, బాలింతలు,కు బిపి,సుగర్ లాంటి రక్త పరీక్షలు చేసి సుఖ ప్రసవం కొ రకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని ,ప్రసవం తర్వాత ఇంటికి (102 )తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చేరుస్తరారని తెలియజేశారు అలాగే బిపి సుగర్ వ్యాధులున్న ప్రజలు మత్తు పానియాలైన ఆల్కహాల్, సారాయి, బీడీ,సిగరెట్టు,గుట్కా పాంపరాగ్, పొగాకు ఉత్పత్తులు పీల్చడం,తినడం చేయరాదని,గుండే జబ్బులు,పక్షవాతం వస్తాయని, తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పి అలివేలు హెల్త్ అసిస్టెంట్ వెంకట ఏఎన్ఎంలు ఈరమ్మ బాలనాగమ్మ ఆశ వర్కర్లు ,గంగమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img