Friday, April 26, 2024
Friday, April 26, 2024

జై భీమ్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర` నందవరం : జై భీమ్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సిక్కం జానయ్య గారి ఆదేశాలు మేరకు నందవరం గ్రామ పంచాయతీ ఆవరణం నందు జై భీమ్‌ ఎమ్మార్పీఎస్‌ నందవరం మండల అధ్యక్షులు శవాల బుజ్జిబాబు, పంచాయతీ కార్యదర్శి రంగనాయకులు,అధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గారి చిత్రపటానికి పూలమాల అర్పించారు. 73,వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఓటు అని గుర్తు రాగానే నాకు గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మహానుభావుడు భారతదేశ స్థితి గతులు మార్చిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అని గుర్తు చేశారు. గణతంత్ర రాజ్యముగా నేలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక,ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని,భావము ,విశ్వాసము, ధర్మము ,కూడిన స్వేచ్ఛ స్వతంత్రముగా అంతస్తులను అవకాశాలలోను సమానత్వంలోను చేకూర్చుటలోనూ మన భారత దేశ ప్రజలందరికీ సమానత్వమును చేకూర్చి 1949 సంవత్సరం నవంబర్‌ 26, వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించబడిరదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి చిన్న పోతప్ప ,మండల ఉపాధ్యక్షులు ఎర్రన్న, మండల నాయకులు భాస్కర్‌, సత్యానందం, గ్రామ అధ్యక్షులు బండారి మోజేష్‌, పి సురేష్‌ ,మరియు పంచాయతీ సెక్రెటరీ రంగనాయకులు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img