Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైస్ ఎంపీపీ పరమేష్ గౌడ్ గుండెపోటుతో మృతి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల పరిధిలోని నౌలేకల్ గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ పరమేష్ గౌడ్ (48)శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. బంధువుల సమాచారం మేరకు నౌలేకల్ గ్రామానికి చెందిన పరమేష్ గౌడ్ పిల్లల విద్యాభ్యాసం కోసం ఎమ్మిగనూరులో కాపురమున్నారు. గురువారం రాత్రి ఛాతి దగ్గర నొప్పి రావడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి చికిత్స చేశారు. గ్యాస్టిక్ అయివుంటుదని ఉదయం కర్నూలు కు వెళదామని అనుకున్నారు. శుక్రవారం ఉదయం పరమేష్ గౌడ్ గుండెపోటుతో అకాల మరణం పొందారు. దీంతో నౌలేకల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, మాజీ ఎంపీపీ రఘురామ్, ఉప సర్పంచ్ విజయేంద్ర రెడ్డి మృతుని స్వగృహానికి వెళ్లి పరమేష్ గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img