కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ
ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ పేకమేడల్ల్లా కూలిపోవడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్కు వచ్చేసరికి తాము చాలా బలంగా ఉన్నామని బీజేపీ అనుకుంటోంది.. అయితే, యోగి నాయకత్వంలోని బీజేపీ పేకమేడల్లా కూలిపోనుందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, యూపీలో నిరుద్యోగిత పెరగడం వంటి కేంద్ర పథకాలే ఇందుకు కారణాలు కానున్నాయని చెప్పారు. కేవలం నినాదాలతో ప్రజలను మభ్యపెట్టలేరని, ఒకసారి ప్రజలను ఫూల్స్ చేయవచ్చు కానీ ప్రతిసారి సాధ్యం కాదని అన్నారు. యూపీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అద్భుతమైన పనీతీరు ప్రదర్శిస్తున్నారని అన్నారు. యోగి కంటే ఆమెకే ఎక్కువ ప్రజాదరణ లభించడం ఖాయమన్నారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చక్కటి పాలన అందిస్తోందని, చాలా మంచి నాయకత్వం ఉందని చెప్పారు. తిరిగి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తుందని అన్నారు.