Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆలయంలో తొక్కిసలాటకు సంబంధించిన వివరాలుంటే తెలపండి

ఉన్నతస్థాయి విచారణ ప్యానెల్‌ విజ్ఞప్తి
నూతన సంవత్సరం వేళ జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్సిసలాట జరిగి 12మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ముగ్గురు సభ్యులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యుడిగా ఉన్న జమ్మూ డివిజినల్‌ కమిషనర్‌ రాఘవ్‌ లాంగర్‌ మాట్లాడుతూ, ఆ దుర్ఘటనపై ప్రజలు ఏదైనా వాస్తవాలు, సమాచారం లేదా ఇతర ఆధారాలను పంచుకోవాలనుకుంటే కమిటీని సంప్రదించాలని కోరారు.ఈ విచారణ ప్యానెల్‌ వారంలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీ తొక్కిసలాటకు గల కారణాలను సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు. జమ్మూ డివిజినల్‌ కమిషనర్‌ రాఘవ్‌ లాంగర్‌, అదనపు డీజీపీ ముఖేశ్‌ సింగ్‌ మిగతా సభ్యులుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img