ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఈసీ లేఖ
అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు భారత ఎన్నికల కమిషన్ సోమవారం లేఖ రాసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరింది. ఎన్నికల కమిషన్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సంసిద్ధతను స్వయంగా సమీక్షించడం ప్రారంభించింది. ఇటీవల యూపీలో ఇటీవల మూడు రోజుల పాటు ఈసీ పర్యటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది.పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లోనూ పర్యటించేందుకు ఈ బృందాలు సిద్ధమవుతున్నాయి.