: మంత్రి మాండవీయ
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 90 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.90 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ మైలురాయిని ఇండియా దాటినట్లు పేర్కొన్నారు. కోవిడ్పై ప్రభుత్వం అసాధారణ రీతిలో పోరాటం చేస్తోందని మంత్రి చెప్పారు.