ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేరళ మాజీ మఖ్యమంత్రి ఊమన్ చాందీ, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాష్, హిబి ఎడిన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏపీ అనిల్ కుమార్పై సీబీఐ మంగళవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.సోలార్ కుంభకోణం కేసుకు సంబంధించి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తపై వేధింపులకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. తిరువనంతపురం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు సీబీఐ మంగళవారంనాడు ఈ ఎఫ్ఐఆర్ సమర్పించింది. ఈ కేసును సీబీఐ తిరువనంతపురం విభాగం దర్యాప్తు చేస్తోంది.