ముంబైలోని ఎంపీ నవనీత్ రాణా ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ ముందు తాము హనుమాన్ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్ దంపతులు హెచ్చరించారు. దీంతో శనివారం శివసేన కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.