ఓవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తుండగా, మరోవైపు గోవాలో ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. గోవాలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గోవా బీజేపీ అధినాయకత్వం వెల్లడిరచడంతో రాజకీయ కలకలం బయల్దేరింది. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఇవాళ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని గోవా బీజేపీ తెలిపింది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ను కలిసినట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్న నేపథ్యంలో గోవా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు సగం మందికి పైగా బీజేపీలోకి వెళుతుండడంతో కాంగ్రెస్ నామమాత్రంగా మారనుంది.