న్యూదిల్లీ : బీజేపీ ప్రజామద్దతు పొందడానికి కార్యకర్తలు పోషించిన పాత్రనే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉద్ఘాటించారు. తన యాప్లో స్ఫూర్తి కలిగించే పార్టీ సభ్యుల కథనాలున్న కమల్ పుష్ప్ విభాగానికి సహాయపడాలని ప్రజలను కోరారు. ‘‘ప్రజల ఆశీర్వాదంతో బీజేపీకి అనేక రాష్ట్రాలు, కేంద్రంలో సేవ చేసే అవకాశం లభించింది. ప్రజల ఈ విశ్వాసం వెనుక ప్రధాన కారణం పార్టీ, దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసి తరతరాలుగా కార్యకర్తలు పోషించిన అద్భుతమైన పాత్ర’’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘నమో యాప్లో ‘కమల్ పుష్ప్’ అనే ఆసక్తికర విభాగం ఉంది.. ఇది జనసంఫ్ు నాటి నుంచి నేటి వరకు మన భావజాలాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చేలా భాగస్వామ్యం చేయడానికి, తెలుసుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది. ఈ విభాగాన్ని మెరుగుపరచండి.’ అన్నారాయన. ఉత్తరాఖండ్కు చెందిన పండిట్ దేవేంద్ర శాస్త్రి , కర్ణాటకకు చెందిన మల్లికార్జునయ్య దంపతుల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. పార్టీ నిర్మాణానికి వారు చేసిన కృషిని ప్రస్తుతించారు.