Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టుతో నవ చరిత్ర సృష్టి: మోదీ

ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు’తో నవ చరిత్ర సృష్టి జరుగనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడేళ్ల వ్యవధిలో పూర్తయిన కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టును సోమవారంనాడు ఆయన ప్రారంభించారు. రూ.399 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ థామ్‌ ఫేజ్‌-1ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.తొలుత ‘హర్‌ హర్‌ మహదేవ్‌’ నినాదంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img