Friday, April 26, 2024
Friday, April 26, 2024

డోలో ట్యాబ్లెట్ల కోసం డాక్టర్లకు వెయ్యి కోట్ల తాయిలాలు’.. సుప్రీం కోర్టు సీరియస్‌

దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో డోలో ట్యాబ్లెట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వారు, జ్వరం లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ డోలో ట్యాబెట్లను వేసుకున్నారంటే ఆశ్చర్యమేం లేదు. డాక్టర్లు సైతం పేషెంట్లకు కచ్చితంగా డోలో ట్యాబెట్లను రిఫర్‌ చేశారు. అయితే ఇందుకోసం డోలో 650 ట్యాబ్లెట్‌ తయారీదారులు ఇందుకోసం డాక్టర్లకు ఏకంగా రూ.1000 కోట్ల తాయిలాలు ఇచ్చారని.. ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. సంస్థ ప్రాంగణాల్లో సీబీడీటీ జరిపిన సోదాల్లో ఈ విషయం బహిర్గతమైందని ఎఫ్‌ఎంఎస్‌ఆర్‌ఏఐ సుప్రీం కోర్టుకు తెలిపింది.జస్టిస్‌ డీవై చంద్రచుద్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నతో కూడి ధర్మాసనం దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించింది. ఈ విషయమై పది రోజుల్లో స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘ఇది చెవులకు వినసొంపైన సంగీతం కాదు. నాకు కోవిడ్‌ వచ్చినప్పుడు కూడా ఆ మెడిసిన్‌ వాడాలని చెప్పారు. ఇది తీవ్రమైన విషయం’ అని జస్టిస్‌ డీవై చంద్రచుద్‌ తెలిపారు.తమ ట్యాబెట్లను ప్రమోట్‌ చేసుకోవడం కోసం డోలో వెయ్యి కోట్లకుపై మొత్తాన్ని డాక్టర్లకు తాయిలాలు ఇచ్చిందని ఫెడరేషనర్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ సంజయ్‌ పరిఖ్‌ తెలిపారు. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌కు సంబంధించిన 36 ప్రాంగణాల్లో సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌) జరిపిన సోదాల్లో.. రూ.300 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడ్డారని తేలిందని.. డోలో ఉత్పత్తిదారులు అనైతిక పద్ధతులు పాటించారని ఫెడరేషన్‌ ఆరోపించింది.ఇలా చేయడం వల్ల మందులు ఓవర్‌ డోస్‌ కావడంతోపాటు.. పేషెంట్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, ఇలాంటి అవినీతికి పాల్పడటం వల్ల మార్కెట్లోకి ఎక్కువ ధరలు ఉన్న లేదా అహేతుకమైన మందులు చొప్పిస్తారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినంగా లేకపోవడం వల్ల ఫార్మా సంస్థలు అనైతిక పద్ధతులను అవలంభిస్తున్నాయని.. కోవిడ్‌ పాండమిక్‌ సమయంలో ఈ విషయం బయటపడిరదన్నారు.ఫార్మాస్యూటికల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. తద్వారా పర్యవేక్షణ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని.. ఫలితంగా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని న్యాయస్థానానికి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img