Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పెద్దలు ఇంటి నుంచి పనిచేస్తుంటే..పిల్లలు పాఠశాలకా ?

24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి
కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూదిల్లీ : దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం వేధిస్తోందని, కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ాప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల ఏమీ జరగడం లేదు. కాలుష్యం పెరుగుతూనే ఉందని మేము భావిస్తున్నాం. సమయం మాత్రమే వృథా అవుతుంది్ణ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆగ్రహం వెలిబుచ్చారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాఠశాలలు ప్రారంభించడంపై దిల్లీ ప్రభుత్వాన్ని మందలించారు. మూడు, నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటే.. పెద్దలు ఇంటి నుంచి పని చేస్తున్నారు్ణ అని అసహనం వ్యక్తం చేశారు. పిల్లలు నేర్చుకునే ప్రక్రియలో వెనుకబడిపోతున్నారని, అనేక చర్చల అనంతరం ఆన్‌లైన్‌ బోధన ఆప్షన్‌తోనే పాఠశాలల ప్రారంభానికి అనుమతి ఇచ్చినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడిరచింది. ాఆన్‌లైన్‌ బోధనను మీరు ఆప్షన్‌కు వదిలేశారు. కానీ, ఇంట్లో ఎవరు కూర్చోవాలనుకుంటున్నారు. మన ఇంట్లోనూ పిల్లలున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన దగ్గరినుంచి వాళ్లకు ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. మేం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం్ణ అని ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా హెచ్చరించారు. ఈ సంక్షోభంపై విచారణ ప్రారంభమైనప్పుడు కాలుష్యం ఒక స్థాయిలో ఉంది. మీరు ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎందుకు పెరుగుతోంది. ఇది ఒక సాధారణ పౌరుడు అడిగే ప్రశ్న. ఎవరూ ఆ నిబంధనల్ని పాటించడం లేదు. ప్రచారం కోసం మాత్రం పర్యావరణాన్ని కాపాడాలంటూ బ్యానర్లు పట్టుకొని ధర్నాలు చేస్తారు్ణ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పది రోజుల సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. కాలుష్యం అంశంపై నాలుగు రోజులుగా వరుసగా సుప్రీం విచారణ చేపడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img