Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రికాషన్‌ డోసుకు నేటి నుంచి స్లాట్‌ బుకింగ్‌

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోసులు అందించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకు శనివారం నుంచి అపాయింట్‌మెంట్లు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అంతేగాక ఈ ముందుజాగ్రత్త డోసుకు అర్హులైన వారు కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. కొవిడ్‌ టీకా రెండు టీకా డోసులు తీసుకున్నవారు ప్రికాషన్‌ డోసుకు అర్హులైతే ఈ డోసు కోసం మళ్లీ కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో వెల్లడిరచింది. నేరుగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img