భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్ టీకాలను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కోవాగ్జిన్ టీకాను రూపొందించిన ఆ సంస్థ ఇప్పుడు ఇంట్రానాసల్ టీకా బీబీవీ154 మూడవ దశ ట్రయల్స్ను పూర్తి చేసినట్లు తెలిపింది. బూస్టర్ డోసు రూపంలోనూ బీబీవీ154 ఇంట్రానాసల్ టీకాను ఇవ్వనున్నారు. మూడవ దశ ట్రయల్స్కు సంబంధించి భారత్ బయోటెక్ సంస్థ ప్రకటన చేసింది. రెండు డోసుల రూపంలో బీబీవీ154 ఇంట్రానాసల్ టీకాను ఇచ్చేందుకు కావాల్సిన అన్ని ట్రయల్స్ను పూర్తి చేసినట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. ఇక బూస్టర్ డోసుగానూ బీబీవీ154ను ఇవ్వవచ్చు అని భారత్ బయోటెక్ చెప్పింది. మూడవ దశ ట్రయల్స్కు చెందిన డేటాను జాతీయ అధికారులకు సమర్పించినట్లు తెలిపింది.