Friday, April 26, 2024
Friday, April 26, 2024

భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం

30 మంది మృతి
ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్ష బీభత్సంతో నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో 30 మంది మృతి చెందారు. చెంబూర్‌లో 19 మంది, విక్రోలిలో 10 మంది, భాండూపులో ఒక్కరు.. మొత్తం 30 మంది మృతి చెందారు.శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు పరిహారం ప్రకటించాయి. ముంబై వరదల్లో ప్రాణనష్టంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img