Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాణా దంపతులకు బెయిల్‌

హనుమాన్‌ చాలీసా వివాదంలో అరెస్టయిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారంనాడు బెయిల్‌ మంజూరు చేసింది. కొన్ని షరతులతో బెయిల్‌పై విడుదల చేసేందుకు అనుమతించింది.బెయిల్‌పై ఉన్న సమయంలో మళ్లీ ఇదే నేరాన్ని పునరావృతం చేయరాదని, ఈ కేసుకు సంబంధించిన ఏ అశంపైన మీడియాతో మాట్లాడరాదని సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. ఇవాళ సాయంత్రం లోగా ఆ ఇద్దరూ రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఇద్దర్నీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నవనీత్‌తో పాటు ఆమె భర్తపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అమరావత్‌ నియోజకవర్గ ఎంపీ నవనీత్‌, బద్నేరా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రవి రాణాను ఏప్రిల్‌ 23వ తేదీన అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img