Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. కానీ, ఓ ట్విస్ట్‌

భారత రాష్ట్రపతిగా జూన్‌ 24న రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం ఈసీ షెడ్యూల్‌ వెలువరించింది. జూన్‌ 15న నోటిఫికేషన్‌ జారీ కానుండగా.. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ఆరంభమవుతుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ తర్వాత ఆ పదవిని చేపట్టే వ్యక్తిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం అధికార బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టగా.. అటు విపక్షాలు కూడా పావులు కదుపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ జూన్‌ 15న ఢల్లీిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి.. ఇందుకు 22 విపక్ష పార్టీలను ఆహ్వానించారు. దీంతో రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఈ తరుణంలో తాను రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెల్లడిరచారు. అయితే, ఆయన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాదు. ఆయన పేరుతో మరో వ్యక్తి. బిహార్‌ సరన్‌ జిల్లా మర్‌హౌర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని రహీమ్‌పుర్‌ గ్రామానికి చెందిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌(42) వ్యవసాయం చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈయనకు ఏడుగురు సంతానం కాగా.. పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం చేశారు. ఆర్జేడీ చీఫ్‌ పేరే కావడం వల్ల గతంలో పలు ఎన్నికల్లో ఆయన పోటీ చేయడంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. జూన్‌ 15న నామినేషన్‌ వేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు ఢల్లీికి టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, 2017 రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసినా ప్రతిపాదించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో తిరస్కరణకు గురైందని తెలిపారు. కానీ, ఈసారి మాత్రం తాను పకడ్బందీగా సిద్ధమయ్యానని పేర్కొన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో లాలూ భార్య, బిహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవీ పోటీచేసిన నియోజకవర్గంలో నామినేషన్‌ వేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీపై సుమారు 50వేల ఓట్ల తేడాతో రబ్రీదేవిపై విజయం సాధించారు. రబ్రీ ఓటమికి ఈ లాలూనే కారణమని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేరు చూసి అందరూ పొరపడ్డారట. అంతేకాదు, అతడికి సుమారు 10వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ పోటీ చేయగా ఆరువేల ఓట్లు లభించాయి.రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడంపై లాలూ మాట్లాడుతూ..‘‘ఇప్పటివరకూ పంచాయతీ నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకూ నా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వచ్చాను.. ఫర్వాలేదు. ఓడితే మాత్రం అత్యధిక ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కుతాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, తమ రాష్ట్రానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌, మీరాకుమారిలు రాష్ట్రపతి అయ్యారని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img