Friday, April 26, 2024
Friday, April 26, 2024

రేపు నామినేషన్‌ వేస్తా: దిగ్విజయ్‌ సింగ్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్‌ సింగ్‌ ఉన్నారు. నామినేషన్‌ పత్రాల్ని తీసుకునేందుకు ఢల్లీికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అధ్యక్ష పదవి కోసం రేపు నామినేషన్‌ వేయనున్నట్లు ఆయన ఇవాళ స్పష్టం చేశారు. అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 75 ఏళ్ల మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌.. గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. కేరళ ఎంపీ శశి థరూర్‌ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్న విషయం తెలిసిందే. థరూర్‌ రేపు తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కూడా నామినేషన్‌ వేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img