60మంది విద్యార్థులకు పాజిటివ్
పాఠశాలల్లో కరోనా వ్యాప్తి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. తాజాగా శ్రీచైతన్య విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. దీంతో పాఠశాలను వచ్చేనెల 20 వరకు మూసివేశారు. క్యాంపస్లో ఉన్న మొత్తం 480 మందికి పరీక్షలు నిర్వహించామని, అందులో 60 మందికి కరోనా నిర్ధారణ అయిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. పాజిటివ్గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు ఉన్నాయని, భయపడాల్సిందేమీ లేదని చెప్పారు.మరో వారం రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైరస్ సోకిన విద్యార్థుల్లో 46 మంది కర్ణాటక వాసులు కాగా.. మిగిలిన 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన క్రమంలో నెలరోజుల క్రితం శ్రీచైతన్య రెసిడెన్సియల్ స్కూల్ను పునఃప్రారంభించారు.