Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ పదవికి సిద్ధూ రాజీనామా

పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ పదవికి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. పంజాబ్‌ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనంటూ లేఖలో పేర్కొన్నారు.అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధూకు కొంత కాలం క్రితమే పంజాబ్‌ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img