జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్లోని బెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు చనిపోయారని, వారు లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులుని అధికారులు తెలిపారు. వారిలో ఒకరిని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్కు చెందిన ఆదిల్ హుస్సెయిన్ గా గుర్తించామన్నారు. అతడు 2018 నుంచి పాకిస్థాన్లో ఉంటున్నాడని వెల్లడిరచారు.