యూరోపియన్ యూనియన్ మెడికల్ ఏజెన్సీ
కొవిషీల్డ్ మార్కెటింగ్ కోసం సీరమ్ ఇండియా అసలు ఈయూ మెడికల్ బాడీకి రిక్వెస్ట్ అప్లికేషన్ పంపలేదని తేలింది .ఈ మేరకు యూరోపియన్ యూనియన్ మెడికల్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీదారులు లాంఛనంగా ఒక మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందని, కానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్లికేషన్ మాకు అందలేదని ఈ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.కాగా సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ఇదేమంత పెద్ద సమస్య కాదని, తాము ఈయూకి దరఖాస్తు చేస్తామని చెబుతున్నారు.