సుప్రీం ఆదేశాలు ఇచ్చినా..జహంగిర్పురిలో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపడం లేదు. హనుమాన్ జయంతి రోజున జహంగిర్పురిలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నార్త్ ఢల్లీి అధికారులు జహంగిర్పురిలో బుల్డోజర్లతో రోడ్డుపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీం స్టే ఇచ్చినా.. అధికారులు మాత్రం విశ్రమించడంలేదు. ఓ మసీదు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేశారు.