కర్నాటకలో హిజాబ్ ధరించడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని కర్నాటక హైకోర్టు సమర్థించగా.. తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపగా.. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేసు ఇంకా పెండిరగ్లో ఉన్నందున పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్పై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువడినా.. దాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే, తాము మెరుగైన తీర్పును ఆశిస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు హిజాబ్, బురఖా వద్దని డిమాండ్ చేస్తున్నారన్నారు.