హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా బీజేపీ నేత, గోవా అసెంబ్లీ మాజీ స్పీకర్ రాజేంద్ర అర్లేకర్ సిమ్లాలోని రాజ్భవవన్లో మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 6న హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్గా ఆయన నియమితులయ్యారు.తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్లేకర్ గోవా అసెంబ్లీకి రెండు సార్లు ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్గా, బీజేపీ గోవా యూనిట్ అధ్యక్షుడుగా పనిచేశారు. అర్లేకర్ ముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బండారు దత్తాత్రేయ పనిచేశారు.