సోమవారం ప్రధానితో సమావేశం కానున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక అధికార ప్రకటనలో తెలియజేశారు. కులాలవారిగా జనగణన జరగాలనే డిమాండ్పై చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు.23న అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలని అన్నారు. తమ పార్టీ ఎంపీలతో పాటు విపక్ష పార్టీల నేతలు కూడా ప్రధానిని అపాయింట్ కోరారని, ఇందుకు సంబంధించి లేఖ కూడా ప్రధానికి రాసామని చెప్పారు.