Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కరోనా కట్టడికి ఆంక్షలు విధించండి

మహారాష్ట్రకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాలు
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగల సందర్భంగా వైరస్‌ ప్రబలకుండా మరిన్ని ఆంక్షలు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. టెస్టు, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేట్‌, ఆంక్షల అమలుతో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని మహారాష్ట్ర సర్కారుకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మహారాష్ట్ర అధికారులకు లేఖ రాశారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన కొన్ని ఈవెంట్ల వల్ల కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్సీడీసీ) ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img