Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కేరళలో 59 కొత్త ఒమిక్రాన్‌ కేసులు

తిరువనంతపురం: కేరళలో గురువారం కొత్తగా 59 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయయి. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్‌19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మొత్తం కేసుల సంఖ్య 480కి చేరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కొత్త కేసుల్లో అలప్పుజా జిల్లా నుంచి అత్యధికంగా 12 కేసులు నమోదవగా త్రిస్సూర్‌10, పతనంతిట్ట8, ఎర్నాకుళం7, కొల్లాం, మలప్పురం జిల్లాల్లో 6 చొప్పున, కోజికోడ్‌`5, పాలక్కడ్‌, కసారాగోడ్‌ నుంచి 2 చొప్పున, కన్నూరు జిల్లాలో ఒక కేసు వెలుగు చూసింది. ఇందులో 42మంది తక్కువ ప్రమాదం దేశాలనుంచి వచ్చినవారు కాగా, ఐదుగురు అధిక ప్రమాదకర దేశాల నుంచి వచ్చినవారు, మరో తొమ్మిదిమంది కాంటాక్ట్‌ల వల్ల వైరస్‌ సోకినవారు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img