Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రతిపక్షాల ఆందోళనలతో గందరగోళం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. పెగాసస్‌ స్పైవేర్‌, రైతుల ఆందోళన, ఇతర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలుపెట్టారు. ఆందోళన ఆపకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడిరది. వీరి నిరసన నడుమే కేంద్రం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు ఎంపీలు ఆందోళన ఉధృతి చేయడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇవాళ గందరగోళం నెలకొన్నది. సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా తిరగి ఆందోళన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img