Friday, April 26, 2024
Friday, April 26, 2024

నెల్లూరులో మరో దారుణ హత్య

విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ప్రశాంతతకుమారు పేరు కానీ ఇటీవల ఆ పరిస్థితులుతారుమారయ్యాయని ప్రజలు భయభ్రాంతులకు గురిఅవుతున్నారు. ఉడ్ హౌస్ సంఘం వద్ద శుక్రవారం రాత్రిమహేష్ అనే యువకుడిని కత్తులతో నరికి చంపిన దుండగులు.మహేష్ స్నేహితులతో క్యారమ్స్ ఆడుతుండగా కొంతమంది ముసుగులు ధరించివచ్చి విచక్షణా రహితంగా కత్తులుతోనరికి పారిపోయినట్టు మహేష్ ను ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్టు సమాచారం.మూడు రోజులముందు తల్పగిరి కాలనీ లో ఒక యువకుడిని గొంతు కోసి హత్య చేసిన ఘటన మరువక ముందే మరోహత్య జరగడం నెల్లూరులో సంచలనంగా మారింది. ప్రాణం తీయడం అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా అయిపోయింది నెల్లూరు నగరంలో. హత్యకు గురైంది మన స్నేహితులు, బందువులు కాకపోయినా హత్య జరిగిన ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ ఉలికి పడాల్సివస్తుంది. గతం లో లేని హత్యలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి.ఎవరుచేస్తున్నారు.ఎవరు చేయిస్తున్నారు అనేవిషయాన్ని పోలీసులు పసిగట్టాలి.హత్య జరగకుండా అరికడితే ఓ ప్రాణం నిలుస్తుంది. అంతే కాకుండా ఒకరు హంతకుడుగా మారకుండా వుంటారుఅలా కాకుండా హత్య జరిగిన తరువాత ఆ హంతకుడిని అరెస్టు చేసి జైలుకు పంపితే వారు ఇంకా కరుడు గట్టిన హంతకులుగా మారి మారణ హోమాన్ని సృష్టిస్తారు.నెల్లూరుకు ఆ పరిస్థితి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్న నెల్లూరు జిల్లా ప్రజానికం.రంగంలోకి దిగిన పోలీసు బృందాలు నెల్లూరు టౌన్ ఉడ్ హౌస్ సంగం వద్ద జరిగిన హత్య కేసు చేధనకు దర్యాప్తు వేగవంతం చేసేందుకు నెల్లూరు నగర డిఎస్పి. ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలుముద్దాయిల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img