Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నూతన ఎంఈఓ భాద్యతలు స్వీకరణ

విశాలాంధ్ర – గుడ్లూరు : మండల నూతన విద్యాశాఖ అధికారిగా ఏ.చంద్రమౌళీశ్వర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తో పలు విద్యా అభివృద్ధి విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంఇఓ చంద్రమౌళేశ్వర్ మాట్లాడుతూ మండలంలోని నాడు నేడు పనులు నాణ్యతతో పాటు, వేగవంతంగా జరిగేలా, చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా మండలంలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని మరియు విద్యార్థులలో పోషకాహార లోపాన్ని తగ్గించి, నాణ్యమైన ఆహారాన్ని వారికి అందేలా ప్రభుత్వం చేపడుతున్న మిడ్ డే మీల్స్ ను మెనూ ప్రకారం సక్రమంగా అందేలా చూస్తానని ఆయన ఈ సంధర్భంగా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img