Friday, April 26, 2024
Friday, April 26, 2024

బ్రిడ్జి భూషణ్ దిష్టిబొమ్మని తగలబెట్టిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు : రెజ్లింగ్ మహిళలపై లైంగిక వేధింపులుచేస్తున్న బిజెపి ఎంపీ బ్రిడ్జిభూషన్ ను అరెస్టు చేయా లని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బ్రిడ్జి భూషణ్ దిష్టిబొమ్మని తగలబెట్టిన సిపిఐ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సిరాజ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి షానవాజ్ లుమాట్లాడుతూ, క్రీడాకారులనులైంగికంగావేదిపులకు. పాల్పడుతున్న బిజెపి చెందిన ఎంపీ బ్రిడ్జి భూషణ్ దిష్టిబొమ్మని తగలబెట్టిన సిపిఐ నాయకులు ఎంపీ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా క్రీడాకారుల పట్ల పోలీసుల జలుశీ చేయడం దారుణం బ్రిడ్జి భూషణ్ అరెస్టు చేసి తమకు న్యాయం చేయకుంటే గెలిచిన గోల్డ్ మెడల్స్ గంగా నదిలో విసిరేస్తామని ఐదు రోజులు వ్యవధి ఇచ్చారు ఆ గోల్డ్ మెడల్స్ కనక గంగా నదిలో పారేవేస్తే దేశ పౌరులు రాజకీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తది ఇప్పటికైనా బ్రిడ్జి భూషణ్ ను అరెస్టు చేసి దేశ పరువు ని కాపాడాలి కానీప్రధాని మోదీ బిజెపి బిజెపి అధిష్టానం ఈ విషయంపై నోరు మెదడుప్పకపోవడంచాలా విచారకరమని అన్నారుబేటి పడావో బేటి బచావోఁ అంటూనే మరొక వైపు పాలనలో చూస్తే మహిళలకు రక్షణ లేదు మల్లహోధులుగా దృఢంగా వున్న రెజ్లిస్ మహిళలకే రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళలకురక్షణఎలాఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే బ్రిడ్జి భూషణ్ పై తగిన చర్యలు తీసుకోకపోతే రెజ్లింగ్ మహిళలకు న్యాయం జరిగే వరకూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజీజ్, అహ్మద్, రైతు సంఘం నాయకులుగంగపట్నం రమణయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి వాహనాల మధు, షాకీర్, సాబాషా, యూసుఫ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిముక్తియార్ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శిలీలా మోహన్, షాజహాన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img