Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జిల్లా పార్టీ పగ్గాలు అందుకున్న ఎమ్మెల్సీచంద్రశేఖర్ రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనెల్లూరు జిల్లా అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి నీ నియమిస్తూ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో జిల్లాలోని చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు ఆనందోత్సాహాన్ని జరుపుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి సౌమ్యుడు,అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండే వ్యక్తి ఇప్పటికే అటు సేవ,ఇటు రాజకీయంగా అనేక పదవులు అలంకరించి మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగినది.ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుఅభిమానులుచంద్రశేఖర్ రెడ్డికిహార్దికశుభాకాంక్షలుతెలియజేస్తున్నారు. మొదటినుంచి చంద్రశేఖర్ రెడ్డి అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం గల వ్యక్తిగా ఉండటం వల్ల రాజకీయంగా అన్ని పార్టీల వారు చంద్రశేఖర్ రెడ్డిని వ్యక్తిగతంగా ఆయనకి గౌరవాన్ని ఇస్తారు. పార్టీ పరంగా రాజకీయ విమర్శలు చేస్తారే తప్ప వ్యక్తిగత దూషణ ఏ రోజు ఏ రాజకీయ నాయకుడిని చేయలేదు అందుకని ఆయనంటే అన్ని వర్గాల ప్రజలు అభిమానిస్తారు అటువంటి చంద్రశేఖర్ రెడ్డికి ఈరోజు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పజెప్పడంతో పార్టీలో మరింత ఉత్సాహంపుంజుకుంది. జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించి ముఖ్యమంత్రి మరింత బాధ్యత పెట్టారని ఆయనకునాపైనఉన్న నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించారని ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img