Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవo


విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు నగరం లో భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో బుధవారం-
జెడ్ఈఓ లక్ష్మణ్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ , ప్రధానోపాధ్యాయులు సింగ్నిజా గార్ల ఆధ్వర్యంలో సర్ సివి రామన్ జయంతిని పురస్కరించుకొని
జాతీయ సైన్స్ దినోత్సవకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్
అల్లం ఉదయ్ శంకర్ సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో ప్రపంచమంతా కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళుతున్నదని దానికి అనుగుణంగా నేటి విద్యార్థుల యొక్క ఆలోచన విధానాల్లో సరికొత్త మార్పులు రావాలని ఆయన కోరారు సైన్స్ దినోత్సవ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలనువిద్యార్థినీ,విద్యార్థుల
తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తిలకించివిద్యార్థులను
అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img