Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మండలంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర

మోడీ సర్కారును మరోసారి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధం —బిజెపి

విశాలాంధ్ర– ఎన్ పి కుంట: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు , అభివృద్ధిని చూసిమరో మారు బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి భారతదేశ ప్రజానీకం మొత్తం ఎదురుచూస్తోందని బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ బాబ్జాన్ , బిజెపి మండల కన్వీనర్ చంద్రమోహన్ రెడ్డి లు వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం మండలములోని పెడబల్లి పి కొత్తపల్లి, నంబులపూలకుంట గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ను బిజెపి నాయకులు కొనసాగించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రb కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివిధ అభివృద్ధి పథకాలను అందజేశారన్నారు. ప్రతి రాష్ట్రంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కొరకు కేంద్రం పెద్దపీట వేస్తూ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి జిల్లా కార్యదర్శి అశోక్, మండల మైనార్టీ అధ్యక్షులు చాంద్ బా, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img