Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వైయస్ఆర్సీపీలో భారీ చేరికలు: ఉప్పల రాము

విశాలాంధ్ర – గూడూరు: పెడన నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త శాసనసభ ఉప్పాల రాము నాయకత్వానికి ఆకర్షితులై రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు పెడన నియోజకవర్గ అభివృద్ధి రాము తోనే సాధ్యమని నమ్ముతూ రాము సమక్షంలో గూడూరు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు సుమారు 40 కుటుంబాలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు..పార్టీలో చేరిన వారు ఏనుముల వెంకటేశ్వరావు-పామర్తి పిచన్న-ఎనుముల నర్సమ్మ-కోడూరు శ్రీను-కోడూరు బాపయ్య-పామర్తి పారు -మోపిదేవి వెంకటేశ్వరరావు- మోపిదేవి సాయి- ఉయ్యూరు మోహన్ రావు- ఉయ్యూరు శివకృష్ణ-యల్లంపల్లి రాము- బుజ్జివరపు రామ్ తుల్లా – రెబ్బ కోటేశ్వరరావు-ఏ ఆనంత్-జోగి బాబురావు- పోతర్లంక వనమలరావు- కోడూరు చిన్న తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా ఉప్పాల రాము వారందరికీ పార్టీ కండవాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి,పార్టీని బలోపేతం చేసేందుకు మీరందరూ శాయశక్తులా కృషి చేయాలని కోరారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img