Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిల్లా కలెక్టర్ ఆకస్మిత పర్యటన

విశాలాంద్ర – జరుగుమల్లి : స్థానిక జరుగుమల్లి మండలం కె బిట్రగుంట గ్రామంలో బుధవారం జరిగిన ఆకస్మిత పర్యాటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏ యస్ దినేష్ కుమార్ కె జి బి వి పాఠశాల ను మరియు జగన్నా లేవుట్ ను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పటిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన జగన్నా లేవుట్ గృహ పధకాలను త్వరితగతిన పూర్తిచేయాలనీ, వారికి కావాలసిన మౌలిక వాతులను లబ్ధిదారులకు అందించాలని అధికారులకు చూచించారు.తదుపరి కెజిబివి స్కూల్ ని సందర్శించి అక్కడ కాకలసిన మౌలిక వసతుల లోపాలు గురించి విద్యార్థులను అడగగా, త్రాగు వాటర్ సదుపాయలు, తరగతి గది నిర్మాణ లోపాలు, ల్యాబ్ వసతులు, అధ్యాపాకుల అవసరతలు లోపాలు ఉన్నాయని తెలియజేసారు. ఈ నేపథ్యలో అయన స్కూల్ నిర్మాణం కొరకు మరియు మౌలిక వసతుల కై నిధుల కేటాయించడం జరిగింది. అదేక్రమంలో అధికారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యారక్రమంలో యం డి ఓ విజయ్ కుమార్,జి సి డి ఓ వర్మిత కుమారి యం ఈ ఓ నాగేంద్ర వదన్, యం పి డి ఓ పద్మజ, తాహసీల్దార్ మహమ్మాద్ నాయుమ్, ఆర్ డబ్వువ్ యస్ రమేష్, ఏ పి యం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img