Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది

కుప్పంలో టిడిపినేతలపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే ఏలూరు

విశాలాంధ్ర – మార్టూరు : రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, వైసీపీ తీరు మారకుంటే వైసీపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు,ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళవారం కుప్పంలో అన్నక్యాంటీన్ పై ధ్వంసం, దాడిని ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కుప్పంలో అన్నక్యాంటీన్ పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు నిచ్చారు. అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దారుణమన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పోటీ కార్యక్రమాలు చేయించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతలు సిగ్గుంటేప్రజాస్వామ్యయుతంగా పోరాడాలన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు.పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్ లపై కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన అడ్డుకునే కుట్ర సిగ్గుచేటన్నారు. టీడీపీ కార్యకర్తలు తిరగబడితే మీరు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదన్నారు. వైసీపీ హైకమాండ్ డైరెక్షన్ లోనే కుట్ర జరిగిందన్నారు.బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img