విశాలాంధ్ర`దర్శి : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాటశాలలు విలీనం పేరుతో మూసివేయడం దారుణమని డి.వై.ఎప్. ఐ జిల్లా కార్యదర్శి కేవి పిచ్చయ్య తెలిపారు. దర్శి సుందరయ్య భవన్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవి పిచ్చయ్య మాట్లాడుతూ గ్రామాలలో తమ ఉరులలో పాటశాలలు ముసివేయవద్దని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. జీఓ 117 రద్దు చేయాలని మరోవైపు ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. పాటశాలలు విలీనం వలన ఉపాద్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:40 నుండి 1:60 కి పెరుగుతుంది అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాటశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు ఉపాద్యాయులు లేరన్నారు. ఈ పరిస్తితులలో రాష్ట్ర ప్రభుత్వం పాటశాలల విలీన ప్రక్రియ ఏ రకంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వగలరో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియ వలన వేలాది మంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది అన్నారు. డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం వున్నదని అమ్మాయిలు చదువు మనుకునే పరిస్తితి వస్తుంది అన్నారు. భవిష్యత్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ వుండవన్నారు. ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నారు. వారందరికీ అన్యాయం చేసినట్టు అవుతుంది అన్నారు. కార్పొరేట్లకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించ కుండ పూర్తి స్థాయిలో అమలు చేయడాన్ని డి.వై.ఎప్ఐ యువజన సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నము అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని పాటశాలల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో దర్శి మండల అధ్యక్ష కార్యదర్శులు ఆర్ జెస్సిపాల్, ఎస్ కోటిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కొప్పుల నారాయణలు పాల్గొన్నారు.