Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సిపిఐ నేత గురవయ్య మృతి

పలువురు సిపిఐ నేతలు నివాళి

విశాలాంధ్ర :కొండపి :సిపిఐ సీనియర్ నాయకుడు కొండపి మండల సిపిఐ మాజీ కార్యదర్శి ఎన్. గురవయ్య (84) సోమవారం ఉదయం 1:30నిముషాలుకు తన స్వగృహం నందు మరణించారు.గురవయ్య మరణించిన విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకొని భౌతికకాయాన్ని సందర్శించి, మృతి దేహాన్ని సిపిఐ పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు.
సిపిఐ పార్టీతోనే జీవితం :గత 50సంవత్సరాలకు పైగా సిపిఐ పార్టీలో అనేక సేవలు అందించారు.అనేక పోరాటాలలో ఆయన పాల్గొన్నాడు,సిపిఐ కొండపి మండల కార్యదర్శి పనిచేసాడు, ప్రజా సమస్యల పరిష్కహారానికి ముందు ఉండేవాడు,ఇంటి వద్ద కంటే పార్టీ కార్యాలయంలోనే ఎక్కువ నివాసం ఉండేవాడు,విశాలాంధ్ర దినపత్రికలో కూడా పనిచేశారు. విశాలాంధ్ర పత్రిక నడుపుతూలో ఇంటింటికి తిరిగి సంవత్సర చందాలు వసులు చేసి విశాలాంధ్ర విలేకరికి చేతోడువాడుగా ఉండేవాడు.
సిపిఐ నాయకులు ఘన నివాళి :సిపిఐ సినియర్ నేత గురవయ్య మృతి దేహాన్ని పలువురు సిపిఐ నాయకులు ఘన నివాళులు అర్పించారు. పార్టీతో అతనికి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని, గురవయ్య భౌతికకాయానికి పార్టీ జెండాను కప్పి అతని ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే స్వామి నివాళి :సిపిఐ సీనియర్ నాయకులు ఎన్. గురవయ్య పార్దివాదేహాన్ని కొండపి శాసనసభ్యులు డాక్టర్. డోలా బాలవీరాంజనేయ స్వామి సందర్శించి నివాళులు అర్పించారు. గురవయ్యతో ఎమ్మెల్యే స్వామికి ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img